
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్, రూపాయి విలువ మారకం కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే పశ్చిమాసియాలో తాజాగా మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొన్ని రోజులు పెరుగుతూ వచ్చాయి. కానీ సడెన్గా సోమవారం ఈ ధరలు భారీ మార్పు కనిపించింది. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.1400పైగా తగ్గింది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు చూసుకుంటే.
మంగళవారం ఉదయం ఆరు గంటలకు దేశీయ మార్కెట్లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,900గా ఉండగా ఈ ధర నిన్న రూ.1,42,910గా ఉంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,30,990గా ఉండగా 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,170 వద్ద కొనసాగుతుంది. ఇక అటు వెండి విషయానికి వస్తే.. ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇవే..
వెండి ధరలు..
హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,39,900గా ఉండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు,పూణె, కోల్కతాలో మాత్రం కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.