Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎంత పెరిగాయంటే..!

|

Jul 04, 2021 | 6:01 AM

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం...

Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎంత పెరిగాయంటే..!
Follow us on

Gold and Silver Price Today: బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం.. ఆదివారం కూడా స్వల్పంగా పెరిగింది. బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు బంగారు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అయితే వెండి ధర విషయానికొస్తే బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై రూ.700 వరకు పెరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో ఆదివారం ఉదయం నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,600 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.

వెండి ధరలు

ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, చెన్నైలో రూ.74,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, కోల్‌కతాలో రూ.69,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, కేరళలో రూ.69,200 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,900 ఉండగా, విజయవాడలో రూ.74,900 వద్ద కొనసాగుతోంది.

అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

NPPA: వినియోగదారులకు షాకింగ్‌.. భారీగా పెరగనున్న మూడు డ్రగ్స్‌ ధరలు.. పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఎన్‌పీపీఏ

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..!

Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు.. యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి బెనిఫిట్స్‌..!