Gold Price Today: ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.? తులం ఎంతకు చేరిందంటే..

బంగారం ధరల్లో కాస్త స్థిరత్వం కనిపిస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరుగతూ పోయిన బంగారం ధరలకు ఇప్పుడు కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తగ్గుదల పెద్దగా లేకపోయినప్పటికీ...

Gold Price Today: ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.? తులం ఎంతకు చేరిందంటే..
Gold

Updated on: Jun 20, 2024 | 6:31 AM

బంగారం ధరల్లో కాస్త స్థిరత్వం కనిపిస్తోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరుగతూ పోయిన బంగారం ధరలకు ఇప్పుడు కాస్త బ్రేక్‌లు పడినట్లు కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే తగ్గుదల పెద్దగా లేకపోయినప్పటికీ, పెరుగుదలకు మాత్రం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. గడిచిన కొన్ని రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గురువారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,360 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,190కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,210 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,970గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 73,060 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,190గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,210గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,190గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,210 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,190గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌ ధర రూ. 72,210గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,190వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,210గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 90,900 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 95,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..