AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే: నితిన్ గడ్కరీ

చెరకు మొలాసిస్‌తో ఇథనాల్‌ను తయారు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయితే ఆ తర్వాత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి చెరకు రసంతో పాటు బి-హెవీ మొలాసిస్‌ను ఉపయోగించడాన్ని అనుమతిస్తూ ఉత్తర్వులను మార్చింది. ఇథనాల్ ఉత్పత్తి ప్రాముఖ్యతపై చక్కెర పరిశ్రమ మరింత శ్రద్ధ వహించాలని గడ్కరీ అన్నారు.

Nitin Gadkari: ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే: నితిన్ గడ్కరీ
Nitin Gadkari
Subhash Goud
|

Updated on: Jan 13, 2024 | 7:11 AM

Share

చక్కెర మిల్లు యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం హామీ ఇచ్చారు. ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర వినియోగంపై ప్రభుత్వ విధానం వల్ల ఏప్రిల్ తర్వాత వారి సమస్యలు తీరనున్నాయి. వసంత్‌దాడ షుగర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ చెరకు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్‌ ఏదో ఒకరోజు ఇంధన ఎగుమతిదారుగా మారుతుందని, అందుకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు

ప్రభుత్వం నిషేధించింది చెరకు మొలాసిస్‌తో ఇథనాల్‌ను తయారు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయితే ఆ తర్వాత ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి చెరకు రసంతో పాటు బి-హెవీ మొలాసిస్‌ను ఉపయోగించడాన్ని అనుమతిస్తూ ఉత్తర్వులను మార్చింది. ఇథనాల్ ఉత్పత్తి ప్రాముఖ్యతపై చక్కెర పరిశ్రమ మరింత శ్రద్ధ వహించాలని గడ్కరీ అన్నారు.

గరిష్ట ఇథనాల్, కనిష్ట చక్కెర లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఇథనాల్‌తో మనం ఫ్లెక్స్ ఇంజిన్ వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇథనాల్‌కు సంబంధించినంత వరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. దాని అనుబంధ ఉత్పత్తులతో పాటు చక్కెర పరిశ్రమ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనివల్ల దేశం ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. ఇందుకోసం గడ్కరీ వేగంగా కసరత్తు చేస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి