Post Office: నెలకు రూ. 2200 జమ చేస్తే చాలు.. మీ చేతికి రూ.1,57,004
Post Office Scheme: పోస్టాఫీసులలో రకరకాల డిపాజిట్ పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులలో చేసే డిపాజిట్లకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో హమీ ఉంటుంది. తక్కువ డిపాజిట్లతో ఎక్కువ రాబడి పొందే పథకాలు ఎన్నో ఉన్నాయి.

Post Office: పోస్టాఫీసులలో అద్భుతమైన స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితయ్యే పోస్టాఫీసులలో ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నాయి. వివిధ రకాల డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. ఎలాంటి రిస్క్ లేకుండా సంవత్సరాల తరబడి డిపాజిట్స్ చేసుకోవచ్చు. మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టవచ్చు. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు పోస్ట్ ఆఫీస్ RD పథకంలో ప్రతి నెలా రూ. 2200 జమ చేస్తే, 60 నెలల్లో ఎంత నిధి సిద్ధమవుతుంది?. ప్రతి నెలా ఒక స్థిరమైన మొత్తం రికరింగ్ డిపాజిట్లో జమ చేయబడుతుంది. పోస్ట్ ఆఫీస్ తన వినియోగదారులకు ఆర్డీ పథకంపై 6.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకంలో మీరు నెలకు కనీసం రూ. 100 పెట్టుబడితో ఖాతాను తెరవవచ్చు.
ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతన్నలకు గుడ్న్యూస్.. రేపు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు!
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతా 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అయితే, ఖాతా తెరిచిన తేదీ నుండి 3 సంవత్సరాల తర్వాత కూడా దీనిని మూసివేయవచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాలో ప్రతి నెలా రూ. 2200 జమ చేస్తే 60 నెలల తర్వాత అంటే మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 1,57,004 లభిస్తాయి.
మీరు డిపాజిట్ చేసిన రూ. 1,32,000తో పాటు ఈ మొత్తంలో రూ. 25,004 వడ్డీ కూడా కలిసి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. అందువల్ల మీ డబ్బు మొత్తం అందులో పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: SBI: వినియోగదారులకు గుడ్న్యూస్.. ఎస్బీఐ భారీ కానుక..!
ఇది కూడా చదవండి: Auto News: ఇది మైలేజీలో రారాజు.. లీటర్ పెట్రోల్కు 70కి.మీ.. కేవలం రూ.57,000లకే హీరో బైక్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




