Petrol Price: వినియోగదారులకు మరింత మోత.. పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.. కారణాలు ఏమిటంటే..

ప్రభుత్వాలు ఏవైనా ప్రత్యెక చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పుడప్పుడే పెట్రోల్ ధరలు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే 110 రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే 125 రూపాయలకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Petrol Price: వినియోగదారులకు మరింత మోత.. పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.. కారణాలు ఏమిటంటే..
Petrol Price

Updated on: Oct 21, 2021 | 2:27 PM

Petrol Price: ప్రభుత్వాలు ఏవైనా ప్రత్యెక చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పుడప్పుడే పెట్రోల్ ధరలు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే 110 రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే 125 రూపాయలకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, పెరుగుదల బాటలో పరుగులు తీస్తున్న క్రూడాయిల్ ధరలు ఇప్పట్లో తమ పరుగును ఆపే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 85 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది వచ్చే మూడు నుండి ఆరు నెలల్లో బ్యారెల్‌కు 100 డాలర్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ధరలు 100 డాలర్లకు చేరుకుంటే, దేశీయ మార్కెట్లో పెట్రోల్..డీజిల్ ప్రస్తుత ధరల నుండి లీటరుకు రూ. 8-10 వరకు ఖరీదు అవుతాయి. రాజస్థాన్.. మధ్యప్రదేశ్ వంటి అధిక వ్యాట్ ఉన్న రాష్ట్రాలలో, ధరలు మరింత పెరుగుతాయి.

ఇరాక్ చమురు మంత్రి ఎహ్సాన్ అబ్దుల్ జబ్బారి ప్రకారం, ముడి చమురు వచ్చే ఏడాది మొదటి, రెండవ త్రైమాసికాల మధ్య బ్యారెల్‌కు 100 డాలర్లను తాకుతుంది. బ్రెంట్ ప్రస్తుత ధర 85 డాలర్లు. ఒక సంవత్సరం క్రితం ధర 42.5 డాలర్లతో పోల్చుకుంటే ఇది రెట్టింపు ధర.. ఇది ముడి అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకునే భారతదేశానికి కష్టాలను పెంచుతోంది.

రాబోయే రోజుల్లో పెట్రోలియం డిమాండ్ పెరుగుతుంది

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాబోయే కొన్ని నెలల్లో పండుగలు.. వివాహాల కారణంగా భారతదేశంలో పెట్రోలియం డిమాండ్ పెరుగుతుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 55-60 పైసలు పెరుగుతాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 1 డాలర్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ముడిచమురు 100 డాలర్లకు చేరితే, అప్పుడు పెట్రోల్, డీజిల్ ధర రూ.10 వరకు పెరగవచ్చు.

ముడి చమురు దిగుమతి కోసం భారత్ ప్రత్యేక వ్యూహం..

ముడి చమురు ధర కారణంగా దేశంలో పెట్రోల్ ధర రూ.110, డీజిల్ ధర రూ.100 దాటిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం ముడి చమురును మెరుగైన ధరకు దిగుమతి చేసుకోవాలనుకుంటోంది. దీని కోసం రూపొందించిన వ్యూహం ప్రకారం.. చమురు శుద్ధి చేసే కంపెనీలు ముడి దిగుమతులతో విడిగా కాకుండా, కలిసి వ్యవహరిస్తాయి.
పెట్రోలియం కార్యదర్శి తరుణ్ కపూర్ చెబుతున్న దాని ప్రకారం, ప్రభుత్వం ప్రైవేట్.. ప్రభుత్వ రిఫైనింగ్ కంపెనీల సమూహాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలో ముడి దిగుమతుల్లో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నందున, అన్ని కంపెనీలు గ్రూపులో వ్యవహరిస్తే, వారు బాగా చర్చలు జరపగలరని ప్రభుత్వం భావిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలకు 4 ప్రధాన కారణాలు

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తెరుచుకోవడంతో డిమాండ్ బాగా పెరిగింది. పెరుగుతున్న చలి కారణంగా యుఎస్‌లో షేల్ ఆయిల్ ఉత్పత్తి క్షీణించింది.
  • పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ, దాని మిత్రదేశాలు (ఒపెక్+) ఉత్పత్తిని రోజుకు 4 లక్షల బారెల్స్ మాత్రమే పెంచనున్నాయి.
  • ఒపెక్+ (OPEC+) ద్వారా ముడి చమురు ఉత్పత్తి పెరిగినప్పటికీ, దాని లభ్యత అవసరం కంటే 14 శాతం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా, క్రూడ్ సెంటిమెంట్ బలంగా ఉంది.
  • బొగ్గు ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం.. సహజ వాయువు ఖరీదైనది కావడంతో ముడి చమురు అదనపు మద్దతు పొందుతోంది. కొన్ని సందర్భాల్లో చమురు గ్యాస్‌కు బదులుగా ఉపయోగించడం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Loading...
Unable to load recommendations.
Follow Us