Indian Railways: చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా.. ప్రయాణికులు చేసే ఈ చిన్న పొరపాటే కారణం..!

Indian Railways Ticket Rules: రైలు ప్రయాణంలో నిబంధనల పట్ల అవగాహన లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రయాణానికి ముందే మీ బోర్డింగ్ స్టేషన్‌ను సరిచూసుకోవడం లేదా అవసరమైతే మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు రైల్వే అధికారులు. అలాంటి చిన్న పాటి పొరపాటుతో జరిమానా చెల్లించాల్సి రావచ్చు..

Indian Railways: చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా.. ప్రయాణికులు చేసే ఈ చిన్న పొరపాటే కారణం..!
Indian Railways
Image Credit source: Gemini AI

Updated on: May 11, 2026 | 8:53 PM

Indian Railways Ticket Rules: మీ దగ్గర కన్ఫర్మ్డ్ టికెట్ లేకపోతే, వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో రైలు ఎక్కలేరు. ఈ నియమం అందరికీ తెలుసు. కానీ చేతిలో కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్నప్పటికీ, ఎవరైనా భారీ జరిమానా చెల్లించాల్సి వస్తే? అదేంటి టికెట్‌ ఉన్నప్పటికీ జరిమానా చెల్లించడం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజం. ఇలాంటిది ఒక మహిళా ప్రయాణికురాలికి జరిగింది. ఇది రైల్వే వారి తప్పు కాదు, ఆ మహిళా ప్రయాణికురాలు చేసిన ఒక చిన్న పొరపాటు. అందుకే ఆమె భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. భారతీయ రైల్వేకు చెందిన ఈ ముఖ్యమైన నియమం గురించి చాలా మందికి తెలియదు. ఒక చిన్న పొరపాటు పెద్ద జరిమానాకు దారితీయవచ్చు.

ఆ మహిళా ప్రయాణికురాలు నెల రోజుల క్రితమే టిక్కెట్టు బుక్ చేసుకుంది. ఆ టిక్కెట్టు కన్ఫర్మ్ కూడా అయింది. కానీ మార్గమధ్యంలో ఆమెకు ఒక పెద్ద షాక్ తగిలింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్టు ఉన్నప్పటికీ, ఆమె రూ.2560 వరకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

జరిమానా ఎందుకు?

ఆ మహిళ టిక్కెట్టు పూర్తిగా చెల్లుబాటులో ఉంది. అలాగే ఆమె ఒక నిర్దిష్ట ఏసీ 2-టైర్ కోచ్‌లో ప్రయాణిస్తోంది. అయినా రైల్వే ఇంత భారీ జరిమానా ఎందుకు విధించింది?

ఇవి కూడా చదవండి

ఆ మహిళా ప్రయాణికురాలు టిక్కెట్టులో కాదు, వేరే పొరపాటు చేసింది. ఆ మహిళ రాజస్థాన్‌లోని రైకా బాగ్ జంక్షన్ స్టేషన్ నుండి తన రైలు టిక్కెట్టును బుక్ చేసుకున్నట్లు తెలిసింది. కానీ, నిర్ణీత స్టేషన్ నుండి రైలు ఎక్కకుండా, ఆమె సుమారు రెండు గంటల తర్వాత పాలి మార్వార్ స్టేషన్ నుండి రైలు ఎక్కింది.

రైల్వే నిబంధనల ప్రకారం, మీరు టికెట్ బుక్ చేసుకున్న బోర్డింగ్ పాయింట్ (Boarding Point) నుండే రైలు ఎక్కాలి. ఒక ప్రయాణికుడు కేటాయించిన స్టేషన్‌లో రైలు ఎక్కకపోతే టిటిఇ ఆ సీటును ‘నాట్ టర్న్డ్ అప్’ (Not Turned Up – NT) గా మార్క్ చేస్తారు. అప్పుడు రైల్వే నిబంధనల ప్రకారం.. ఆ సీటును RAC టిక్కెట్టు ఉన్న మరొక ప్రయాణికుడికి కేటాయిస్తారు. తర్వాతి రెండు స్టేషన్ల వరకు లేదా ప్రయాణ సమయాన్ని బట్టి ఆ సీటును వేచి ఉన్న (RAC/Waiting List) ఇతర ప్రయాణికులకు కేటాయించే అధికారం టిటిఇకి ఉంటుంది. బోర్డింగ్ పాయింట్ మార్చుకోకుండా మధ్యలో రైలు ఎక్కితే అది టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా భావించి జరిమానా విధిస్తారు.

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

ఆ మహిళ తన సీటు వద్దకు చేరుకున్నప్పుడు నిబంధనల ప్రకారం ఆమె సీటును అప్పటికే మరో ప్రయాణికుడికి ఇచ్చేశారని టిటిఇ ఆమెకు తెలియజేశారు. ఆమె టిక్కెట్టులో పేర్కొన్న బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కకపోవడం, అలాగే బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోకపోవడం వల్ల రైల్వే నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు జరిమానా విధించారు. ఆమె టిక్కెట్టు అసలు ఛార్జీకి దాదాపు రెట్టింపు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

భారతీయ రైల్వే నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

ప్రయాణికుడు టిక్కెట్టులో పేర్కొన్న స్టేషన్ నుండే రైలు ఎక్కాలి. ఏదైనా కారణం చేత బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవలసి వస్తే, చార్ట్ సిద్ధం చేయడానికి ముందే ఆ మార్పు చేయాలి. రైలు బయలుదేరడానికి కనీసం అరగంట ముందు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. IRCTC వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుండి బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికుడు నిబంధనల ప్రకారం బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోకుండా, నిర్దేశించిన స్టేషన్ నుండి రైలు ఎక్కకపోతే, రైల్వే అధికారులు ఆ సీటును ఖాళీగా పరిగణించి, దానిని మరొక ప్రయాణికుడికి కేటాయించవచ్చు. బోర్డింగ్ పాయింట్ మార్చుకోకుండా వేరే స్టేషన్‌లో రైలు ఎక్కడం రిస్క్‌తో కూడుకున్న పని. ఇలా చేయడం వల్ల మీ సీటు ఇతరులకు వెళ్లడమే కాకుండా, మీరు భారీ జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఇదే.. ఈ ఒక్క పనితో కోటీశ్వరులయ్యారు.. కేవలం రూ.1 లక్ష పెడితే రూ. 1.09 కోట్లు..!

రైలు ప్రయాణంలో నిబంధనల పట్ల అవగాహన లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రయాణానికి ముందే మీ బోర్డింగ్ స్టేషన్‌ను సరిచూసుకోవడం లేదా అవసరమైతే మార్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు రైల్వే అధికారులు.

ఇది కూడా చదవండి: Pension: నెలకు కేవలం రూ.210 డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతినెల రూ.5000 పెన్షన్‌.. ప్రభుత్వ నుంచి అద్భుతమైన పథకం!

ఇది కూడా చదవండి: Gold Import: భారత్‌కు బంగారం ఎక్కడి నుండి వస్తుంది? రోజువారీ అమ్మకాల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us