AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ఈ వారమే టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు.. స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయంటే..

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) రంగ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్(Infosys) నాలుగో త్రైమాసిక ఫలితాలు, గత ఆర్థిక సంవత్సరం స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశను నిర్ణయించే అవకాశం ఉంది...

Stock Market: ఈ వారమే టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు.. స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయంటే..
Srinivas Chekkilla
|

Updated on: Apr 11, 2022 | 6:45 AM

Share

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) రంగ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్(Infosys) నాలుగో త్రైమాసిక ఫలితాలు, గత ఆర్థిక సంవత్సరం స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో పాటు మార్కెట్‌ కోణంలో కూడా గ్లోబల్‌ ట్రెండ్‌ కీలకం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. స్టాక్ మార్కెట్లుఈ వారం మూడు రోజులే ఉండనున్నాయి. గురువారం మహావీర్ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌కు సెలవు ఉంటుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు. ఈ వారం ట్రేడింగ్ సెషన్‌లు తక్కువగా ఉంటాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. అయితే త్రైమాసిక ఫలితాల ప్రకటన ఈ వారంలో ప్రారంభం కానుండటం ముఖ్యం. టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలు వారంలో రానున్నాయి.

మార్కెట్ పార్టిసిపెంట్లు పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపి), వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణ డేటాపై కూడా ఒక కన్నేసి ఉంచుతారని మిశ్రా చెప్పారు. ఈ గణాంకాలు ఏప్రిల్ 12న వస్తాయి. దేశీయ అంశాలే కాకుండా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పరిణామాలు, ప్రపంచ మార్కెట్ల పనితీరును కూడా పెట్టుబడిదారులు గమనిస్తారని ఆయన చెప్పారు. దీనితో పాటు, రూపాయి హెచ్చుతగ్గులు, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ధోరణి, ముడి చమురు ధరల నుండి కూడా మార్కెట్ దిశను నిర్ణయించనుంది.

టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలతో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభమవుతుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. TCS త్రైమాసిక ఫలితాలు ఏప్రిల్ 11 న, ఇన్ఫోసిస్ ఏప్రిల్ 13న వస్తాయి. ఇది కాకుండా ప్రపంచ సూచికలు, ముడి చమురు ధరల అస్థిరత, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడుల ప్రవాహం కూడా మార్కెట్‌కు దిశానిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి.గత వారం, BSE యొక్క 30-షేర్ సెన్సెక్స్ 170.49 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 113.90 పాయింట్లు నష్టపోయింది.

Read Also.. Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌.. అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్‌ ప్లేస్‌..!