New Income Tax Bill: వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్‌ బిల్లు.. నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన..

కొత్త ఆదాయపు పన్ను చట్టంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు - వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడానికి ఉద్దేశించిన ప్రత్యక్ష పన్ను చట్టం - వచ్చే వారం ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

New Income Tax Bill: వచ్చే వారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్‌ బిల్లు.. నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన..
Budget 2025

Updated on: Feb 01, 2025 | 4:04 PM

కొత్త ఆదాయపు పన్ను చట్టంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు – వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడానికి ఉద్దేశించిన ప్రత్యక్ష పన్ను చట్టం – వచ్చే వారం ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం కేంద్ర బడ్జెట్ 2025 ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం గురించి కీలక ప్రకటన చేశారు.

కొత్త చట్టం పన్నులను లెక్కించడం, రిటర్న్‌ ఫైల్ చేయడం లాంటి వాటిని సులభతరం చేస్తుంది. ఇతర అంచనాల మధ్య ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం (FY) vis-a-vis అకౌంటింగ్ ఇయర్ (AY) భావనను రద్దు చేస్తుంది.

వేతన జీవులకు పరిష్కారాన్ని చూపే విధంగా దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని రూపొందిస్తామని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం వచ్చే వారం కొత్త బిల్లును తీసుకువస్తామన్నారు.

ప్రస్తుతం దేశంలో 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం అమలులో ఉంది. 2020 బడ్జెట్‌లో, ప్రభుత్వం ఈ చట్టం ప్రకారం కొత్త పన్ను విధానాన్ని అమలు చేసింది. కానీ 2024 జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. దేశంలో ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇందుకోసం సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు అదే ప్రాతిపదికన, ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువస్తుందని ప్రకటించింది.. దాని నుండి రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం దేశంలో 1961 చట్టం స్థానంలో ఉంది.

కొత్త బిల్లు ఎలా ఉండనుంది..?

కొత్త ఆదాయపు పన్ను చట్టంలో ఏమి జరుగుతుందో బడ్జెట్‌లో నిర్దిష్ట ప్రకటన చేయలేదు. అయితే బడ్జెట్‌లో ప్రభుత్వం గుర్తించిన ఆరు ప్రధాన అంశాల్లో ఒకటి నియంత్రణ సంస్కరణలు.. నిన్న విడుదల చేసిన ఆర్థిక సర్వేలో కూడా దేశంలో సరళీకృత నియంత్రణ గురించి ప్రస్తావించారు.. దీని ప్రకారం.. ఖచ్చితంగా ప్రభుత్వం కొత్త చట్టంలో పన్నులను సరళీకృతం చేస్తుంది.

కొత్త ఆదాయపు పన్ను చట్టం అన్ని వర్గాలకు ‘న్యాయం’ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత బిల్లు కంటే ఇది సరళంగా ఉంటుంది. దీంతో వ్యాజ్యాలు తగ్గుతాయి.

1961 చట్టం – ప్రత్యక్ష పన్నులు, అంటే వ్యక్తిగత, కార్పొరేట్ పన్ను, అలాగే సెక్యూరిటీల లావాదేవీలు, బహుమతులు, సంపదపై పన్ను విధింపు తదితర అంశాలున్నాయి.. దీనిలో 23 అధ్యాయాలు.. 298 విభాగాలు ఉన్నాయి.

Budget 2025 LIVE: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us