భారతదేశంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడానికి ఆధార్ తప్పనిసరి చేయడంతో ఆధార్ కార్డును లైవ్లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పుట్టిన దగ్గరి నుంచి చనిపోయే వరకూ ఆధార్ ఏదో రూపంలో అవసరం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నిర్వహించే సుమారు 1,200 ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సేవా బట్వాడా కోసం ఆధార్ ఆధారిత గుర్తింపు ఉపయోగిస్తారు. అదనంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వంటి ఆర్థిక సంస్థల వంటి సేవా ప్రదాతలు అందించే అనేక ఇతర సేవలు కూడా వినియోగదారులను సులభంగా ప్రామాణీకరించడానికి, ఆన్బోర్డ్ చేయడానికి ఆధార్ను ఉపయోగిస్తున్నాయి. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేటింగ్ రూల్స్ 2016 ప్రకారం ఆధార్ నంబర్ హోల్డర్లు తమ డేటా కచ్చితత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎన్రోల్మెంట్ తేదీ నుంచి కనీసం పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్లో తమ సపోర్టింగ్ పేపర్లను అప్డేట్ చేయాల్సి ఉంది. అందువల్ల ఈ ఏడాది జూన్ 14 వరకూ ఈ సేవను ఫ్రీగా అందించిన ప్రభుత్వం తాజాగా గడువును పెంచింది. కాబట్టి ఆధార్ అప్డేట్ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.
ఆధార్ నంబర్ హోల్డర్లందరూ తమ డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి ఎన్రోల్మెంట్ తేదీ నుంచి కనీసం పదేళ్లకు ఒకసారి ఆధార్లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) సూచించింది. యూఐడీఏఐ నెటిజన్ల కోసం ఆధార్ కార్డ్ పత్రాల నవీకరణ కోసం ఉచిత సర్వీస్ను ప్రారంభించింది. గతంలో ఈ గడువు జూన్ 14 వరకూ ఉండగా ప్రస్తుతం సెప్టెంబర్ 30 వరకూ ఉంచింది. ఈఉచిత సేవ ప్రత్యేకంగా మైఆధార్ పోర్టల్లో అందుబాటులో ఉండాలి. అయితే మీరు భౌతిక ఆధార్ కేంద్రాలను ఉపయోగించాలనుకుంటే రూ. 50 ఛార్జీ ఇప్పటికీ వర్తిస్తుంది. మీరు మీ జనాభా సమాచారాన్ని (పేరు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి) అప్డేట్ చేయాలనుకుంటే మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. మీరు ప్రామాణిక ఆన్లైన్ అప్డేట్ సేవను ఉపయోగించవచ్చు లేదా మీ స్థానిక ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. కాబట్టి ఆన్లైన్లో ఈ సేవను ఎలా ఉపయోగించుకోవాలో? ఓసారి చూద్దాం.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం