అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లో మొదలైన ఆన్‌లైన్ ఆర్డర్లు..

| Edited By:

May 04, 2020 | 6:40 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు..

అమెజాన్, ఫ్లిప్‌కార్టుల్లో మొదలైన ఆన్‌లైన్ ఆర్డర్లు..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీంతో.. ఆయా ప్రాంతాల్లోని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్ నుంచి మినహాయింపును ఇవ్వడంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే కాకుండా ఫోన్లు, ఇతర ఉత్పత్తుల డెలివరీని కూడా ప్రారంభించాయి. అలాగే దీనికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోజు నుంచి అమ్మకాలను ప్రారంభించాయి. అయితే వీటిని మాత్రం అందరూ ఆర్డర్లు చేయలేరు. కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లోలో డెలివరీ చేయనున్నాయి.

అయితే ఖచ్చితంగా సేఫ్టీ నిబంధనలు పాటించాలని, వస్తువును వినియోగదారుడికి అందించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే డెలీవరీ ఐటెమ్ ఇంటి బయటకి ఇచ్చేలా సంస్థలు డెలివరీ బాయ్స్‌కు సూచనలు చేయాలని పేర్కొన్నాయి. అంతేకాకుండా సాధారణం కంటే ఈ సమయంలో డెలీవరీ ఆలస్యం అయ్యేలా ఉందని కూడా ఈ కామర్స్ సంస్థలు తమ వెబ్‌సైట్లలో ‘నోట్’ రాసి ఉంచుతున్నారు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!