
ప్రస్తుతం టెలికం రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. యూజర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మార్కెట్లో లీడింగ్లో ఉన్న జియో, ఎయిర్టెల్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ను అందిస్తూ యూజర్లను తమవైపు తిప్పుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రూ. 395 ప్లాన్తో కొత్త రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్లాన్తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.? వీటి ద్వారా లభించే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 395తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో మొత్తం 6 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఉచితంగా 600 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. వీటితో పాటు అపోలో 24|7 సర్కిల్కు 3 నెలల పాటు యాక్సెస్ ఉచితంగా పొందొచ్చు. అలాగే రూ. 395 ప్లాన్తో ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాలింగ్ కాల్స్ పొందొచ్చు. రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ. 395 ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్తో అన్లిటిమెడ్ 5జీ డేటా అందిస్తుంది. 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా ఇస్తారు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆప్షన్ను అందించారు. అలాగే ఉచితంగా 1000 ఎస్ఎంఎస్లు పొందొచ్చు. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్కు కాంప్లిమెంటరీ యాక్సెస్ అందిస్తున్నారు. “మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్” ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..