
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల వాళ్లు తమ పిల్లల భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో పొదుపు చేయడంలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం గత సంవత్సరం వినూత్నమైన ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. ఖాతాదారులకు నెలవారీ పొదుపును అలవాటు చేయడంతో పాటు వారి పిల్లల భవిష్యత్ను ఈ పథకం ద్వారా మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పొదుపు-కమ్-పెన్షన్ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రిస్తుంది. ఈ పథకంలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు. అలాగే పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత విద్య, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించేలా ఈ స్కీమ్ను రూపొందించారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య (ఎన్పీఎస్ వాత్సల్య) అనేది ఒక నెలవారీ కాంట్రిబ్యూటరీ పథకం. ఇది తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డబ్బు ఆదా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎన్పీఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు గరిష్ట పరిమితి లేకుండా నెలకు కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆ పొదుపు చేసిన సొమ్మును భవిష్యత్తులో వారి విద్య కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. మీ పిల్లలకు బిడ్డకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ ఖాతాను సాధారణ ఎన్పీఎస్ ఖాతాగా సులభంగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండిన తేదీ నుంచి మూడు నెలల్లోపు కొత్త కేవైసీని పూర్తి చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి