AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ వార్నింగ్‌.. ఇలా చేయకపోతే రూ.10 లక్షల జరిమానా!

TRAI: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భారతదేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ జనాభాలో ఇప్పటికీ సాంకేతికంగా పరిజ్ఞానం లేనివారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అవాంఛిత, స్పామ్ కాల్స్ ద్వారా ప్రజలను మోసానికి..

TRAI: టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ వార్నింగ్‌.. ఇలా చేయకపోతే రూ.10 లక్షల జరిమానా!
Subhash Goud
|

Updated on: Feb 14, 2025 | 7:25 AM

Share

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కస్టమర్లను పదే పదే వేధించే అవాంఛిత లేదా స్పామ్ కాల్‌లను ఆపడానికి TRAI కొత్త నియమాలను జారీ చేసింది. ఇందులో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, బిఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు చేసిన కొన్ని తప్పులకు గానూ రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇలాంటి స్పామ్, అవాంఛిత కాల్స్ ఆపడానికి టెలికాం కంపెనీలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని TRAI కొత్త నిబంధనలలో స్పష్టంగా పేర్కొంది.

స్పామ్ కాల్స్ సంఖ్యను చెప్పాల్సి ఉంటుంది:

కొత్త నిబంధనల ప్రకారం, ఏ నంబర్‌కు ఎన్ని స్పామ్ కాల్స్ వచ్చాయో ఖచ్చితంగా వెల్లడించాలని టెలికాం కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశించింది. ఇది మాత్రమే కాదు, కంపెనీలు ఇలా చేయకపోతే, వారు రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

అసాధారణంగా అధిక సంఖ్యలో కాల్స్, తక్కువ వ్యవధిలో కాల్స్, ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ నిష్పత్తి వంటి పారామితుల ఆధారంగా కాల్, SMS నమూనాలను విశ్లేషించాలని TRAI అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించింది. దీని ఆధారంగా స్పామ్ కాల్స్ జాబితాను అందించమని వారిని ట్రాయ్‌ కోరింది.

‘టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కన్స్యూమర్ ప్రియారిటీ రూల్స్’ను సవరించడం ద్వారా, టెలికాం కంపెనీలపై జరిమానాలు విధించే నిబంధనలు రూపొందించారు. ఈ కొత్త నిబంధనలను కంపెనీలు సరిగ్గా అమలు చేయలేకపోతే, అప్పుడు వారిపై ఈ జరిమానా విధించబడుతుంది. కొత్తగా నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం, తప్పుడు సమాచారం అందించినందుకు టెలికాం కంపెనీలకు మొదటి ఉల్లంఘనకు రూ. 2 లక్షలు, రెండవ ఉల్లంఘనకు రూ. 5 లక్షలు, తదుపరి ఉల్లంఘనలకు రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుంది.

భారతదేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ జనాభాలో ఇప్పటికీ సాంకేతికంగా పరిజ్ఞానం లేనివారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో అవాంఛిత, స్పామ్ కాల్స్ ద్వారా ప్రజలను మోసానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీని గురించి ఆందోళన చెందుతోంది. అలాగే ప్రజలను అవగాహన కల్పించడానికి నిరంతరం కృషి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ట్రాయ్ ఈ నిర్ణయం రాబోయే కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!