AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంపీ సంజయ్ సింగ్‌పై ఇంక్ దాడి…

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీలు అక్కడికి చేరుకుంటండంతో ఆందోళన మరింత పెరుగుతోంది. హత్యకు గురైన దళిత యువతి కుటుంబసభ్యులకు పరామర్శల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఆప్‌ బృందం ఎంపీ సంజయ్‌సింగ్‌...

ఎంపీ సంజయ్ సింగ్‌పై ఇంక్ దాడి...
Sanjay Kasula
|

Updated on: Oct 05, 2020 | 4:28 PM

Share

Ink Thrown : ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. వివిధ రాజకీయ పార్టీలు అక్కడికి చేరుకుంటండంతో ఆందోళన మరింత పెరుగుతోంది. హత్యకు గురైన దళిత యువతి కుటుంబసభ్యులకు పరామర్శల పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఆప్‌ బృందం ఎంపీ సంజయ్‌సింగ్‌ నేతృత్వంలో హాథ్రస్‌కు వచ్చింది.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగివెళ్తుండగా ఎంపీ సంజయ్‌సింగ్‌పై ఇంక్‌ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి సంజయ్‌సింగ్‌పై సిరా చల్లడంతో గొడవ జరిగింది. ఇంక్ చల్లిన వ్యక్తి ఆప్ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త మరింత పెరిగింది.

ఇంక్‌ చల్లిన వ్యక్తిని ఆప్‌ కార్యకర్తలు పట్టుకున్నారు. పట్టుకున్న వ్యక్తిపై ఆప్ కార్యకర్తలు దాడికి దిగారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవ వెనుక బీజేపీ నేతల హస్తముందని సంజయ్‌సింగ్ ఆరోపణలు గుప్పించారు‌. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.