AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కొడుకుపై నటి కంగనా టీం సంచలన కామెంట్స్..!

ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణం ఇంకా బాలీవుడ్ ప్రకంనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత అందాల నటి కంగనా రనౌత్‌ విమర్శల దాడికి దిగుతోంది. బాలీవుడ్ పెద్దలను టార్గెట్‌ చేస్తూ దుమ్మేత్తిపోస్తోంది. ఇదే క్రమంలో తాజాగా సంచలన ఆరోపణలు చేసింది కంగనా.

సీఎం కొడుకుపై నటి కంగనా టీం సంచలన కామెంట్స్..!
Balaraju Goud
|

Updated on: Aug 01, 2020 | 4:04 AM

Share

ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ మరణం ఇంకా బాలీవుడ్ ప్రకంనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత అందాల నటి కంగనా రనౌత్‌ విమర్శల దాడికి దిగుతోంది. బాలీవుడ్ పెద్దలను టార్గెట్‌ చేస్తూ దుమ్మేత్తిపోస్తోంది. ఇదే క్రమంలో తాజాగా సంచలన ఆరోపణలు చేసింది కంగనా టీం. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకునే టార్గెట్ చేసింది. సీఎం తనయుడ్ని బేబీ పెంగ్విన్‌ అంటూ సెటైర్స్‌ వేసింది. ఒక వేళ నేను నా ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తే నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం భావించకండి. ప్రతీ ఒక్కరి తెలుసు కానీ ఎవరు అతని పేరు చెప్పరు. కరణ్ జోహార్‌ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రపంచంలోనే గొప్ప సీఎంకు గొప్ప కొడుకు, అందుకు ప్రేమగా పిలిచే బేబీ పెంగ్విన్‌` అంటూ కంగనా రనౌత్‌ టీం ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు ముందుకు అతని ఇంట్లో పార్టీ జరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కంగనా ట్వీట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.

కంగనా ట్వీట్ల నేపథ్యంలో సుశాంత్ అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఇంతకాలం చీకటి మాటున జరిగి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తున్న కంగనాను అందరు వెనుకేసుకు వస్తున్నారు. రోజుకో మలుపు తిరుగున్న సుశాంత్ కేసుతో బాలీవుడ్ పెద్దలకు లింకులు అన్నట్లు ఆరోపణలు వస్తుండటంతో కేసును సీబీఐకి అప్పగించాలన్న వాదన వినిపిస్తోంది. కానీ అందుకు మహారాష్ట్ర సర్కార్‌ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కంగనా టీం చేసిన కామెంట్స్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.