కొత్త మ్యాప్.. సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం
భారత్ కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ కొత్త మ్యాప్ లో వీటిని చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. కాలాపానీ. లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను..
భారత్ కు చెందిన మూడు భూభాగాలను తమవిగా ప్రకటించుకుంటూ ఓ కొత్త మ్యాప్ లో వీటిని చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును నేపాల్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. కాలాపానీ. లిపులేఖ్, లింపియాధుర ప్రాంతాలను ఈ నూతన మ్యాప్ లో చేర్చారు. వివాదాస్పదమైన ఈ బిల్లుకు అనుకూలంగా 258 మంది సభ్యులు ఓటు వేశారు. (సభలో మొత్తం ఉన్న సభ్యుల సంఖ్య 275). నేపాల్ ప్రభుత్వ వైఖరిపై భారత్ ప్రకటించిన తీవ్ర వ్యతిరేకతను పట్టించుకోకుండా అక్కడి పార్లమెంట్ ఈ సవరణ బిల్లును ఆమోదించడం విశేషం. కొత్త మ్యాప్ ఆమోదానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రతిపాదనకు ఈ నెల 9 న నేపాల్ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.