కేటీఆర్, జగన్‌లపై లోకేశ్ ఫైర్

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో డేటా వార్ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి డేటా సర్వీస్ అందిస్తోన్న ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్, లోకేశ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఐటీగ్రిడ్ కంపెనీపై చర్యలు తీసుకోవడం పట్ల టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందనకు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, జగన్ ల జోడి కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని అన్నారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైకాపా నాయకులు చదువుతున్నారు. వైకాపా ప్రొడక్షన్, […]

కేటీఆర్, జగన్‌లపై లోకేశ్ ఫైర్
Follow us

|

Updated on: Mar 04, 2019 | 5:52 PM

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో డేటా వార్ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి డేటా సర్వీస్ అందిస్తోన్న ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్, లోకేశ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఐటీగ్రిడ్ కంపెనీపై చర్యలు తీసుకోవడం పట్ల టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందనకు లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, జగన్ ల జోడి కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని అన్నారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైకాపా నాయకులు చదువుతున్నారు. వైకాపా ప్రొడక్షన్, టిఆర్ఎస్ డైరెక్షన్‌లో TDP పార్టీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది అని లోకేశ్ అన్నారు.

ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ది రాలేదు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్ లో చేస్తారా? ఆంధ్రప్రదేశ్ కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా? అని కేటీఆర్‌ను లోకేశ్ ప్రశ్నించారు.

అభివృద్ధి-సంక్షేమంలో పోటీపడలేక ఆంధ్రప్రదేశ్ లో బలహీనమైన ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ ఉండదు, మీ ఆటలు సాగుతాయి అనేది టిఆర్ఎస్ కుట్ర అని లోకేశ్ అన్నారు. జగన్ మోడీ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేతగా జీతం కావాలి, పోలీసుల నుంచి రక్షణ కావాలి, ప్రజల ఓట్లు కావాలి కానీ ఆయనకు ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ప్రజల పై నమ్మకం ఉండదు. అందుకే TS లో ఉంటూ TRS సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలి అనే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై లోకేశ్ విరుచుకుపడ్డారు.