AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్ బాధితులకు గుడ్ న్యూస్.. కెసీఆర్ కొత్త యాక్షన్ ప్లాన్

గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కోరారు. ‘‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కుంటూ, గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ […]

గల్ఫ్ బాధితులకు గుడ్ న్యూస్.. కెసీఆర్ కొత్త యాక్షన్ ప్లాన్
Rajesh Sharma
|

Updated on: Oct 12, 2019 | 4:53 PM

Share

గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కోరారు.

‘‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కుంటూ, గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతా చేస్తే వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ బిడ్డలు పనికోసం వేరే చోటకి వెళ్తే, తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిని తిరిగి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి నాక్ లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళతాను’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఎన్.ఆర్.ఐ. విధానం అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జిఎడి ముఖ్య కార్యదర్శి ఆధార్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళ రాష్ట్రంలో పర్యటించనుంది. గల్ఫ్ దేశాల్లో పనికి పోయిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సిఎం సమావేశం కానున్నారు.

Follow Us
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే డబ్బే డబ్బు..
కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే డబ్బే డబ్బు..
చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఫేమస్ హీరోస్..గుర్తుపట్టారా?
చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఫేమస్ హీరోస్..గుర్తుపట్టారా?