కేసీఆర్ మమ్మల్నేమీ చేయలేరు: దేవినేని ఉమా

విజయవాడ: ఐటీ గ్రిడ్‌పై కేసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. దొంగబ్బాయి జగన్‌తో చేతులు కలిపి కేసీఆర్ మమ్మల్నేమీ చేయలేరని అన్నారు. చెల్లే చెక్కులే టీడీపీ ఇస్తుందని కానీ వైసీపీ పార్టీనే చెల్లని పార్టీ అని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతి సోమవారం పోలవరం పర్యటన ఉన్నట్టే ప్రతి శుక్రవారం జగన్‌కు కోర్టు ఉందని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరంపై […]

కేసీఆర్ మమ్మల్నేమీ చేయలేరు: దేవినేని ఉమా
Follow us

|

Updated on: Mar 04, 2019 | 5:40 PM

విజయవాడ: ఐటీ గ్రిడ్‌పై కేసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. దొంగబ్బాయి జగన్‌తో చేతులు కలిపి కేసీఆర్ మమ్మల్నేమీ చేయలేరని అన్నారు. చెల్లే చెక్కులే టీడీపీ ఇస్తుందని కానీ వైసీపీ పార్టీనే చెల్లని పార్టీ అని విమర్శించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతి సోమవారం పోలవరం పర్యటన ఉన్నట్టే ప్రతి శుక్రవారం జగన్‌కు కోర్టు ఉందని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరంపై ఎంపీ కవిత కేసులు పెట్టారు. అలాంటి వారితో దొంగబ్బాయి చేతులు కలిపారని మండిపడ్డారు. కృష్టా జలాలను శ్రీశైలం నుంచి 2300 అడుగుల ఎత్తులో ఉన్న పలమనేరు, కుప్పానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఉమ కొనియాడారు.