జాన్వీ రెండో సినిమాకు టైటిల్ ఫిక్స్..?
గతేడాది ‘ధడక్’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. ఆ సినిమాతో మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జాన్వీ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ లక్నోలో జరుగుతుండగా దీనికి ‘కార్గిల్ గర్ల్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కార్గిల్ గర్ల్’ బావుంటుందని చిత్ర యూనిట్ […]
గతేడాది ‘ధడక్’తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. ఆ సినిమాతో మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జాన్వీ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ లక్నోలో జరుగుతుండగా దీనికి ‘కార్గిల్ గర్ల్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కార్గిల్ గర్ల్’ బావుంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో పంకజ్ కపూర్, అంగన్ బేడీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత జాన్వీ ‘తక్త్’లో నటించనుంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్, కరీనా కపూర్, అలియా భట్, భూమి పడ్కేకర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.