AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరిలో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

దిల్లీ: ఫిబ్రవరి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు తగ్గాయి. గత నెలలో రికార్డు స్థాయిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా అందులో కేంద్ర జీఎస్‌టీ(సీజీఎస్‌టీ) రూ.17,626కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ) రూ.24,192కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ(ఐజీఎస్‌టీ) రూ.46,953కోట్లు(దిగుమతుల మీద వసూలైన సెస్‌ కింద రూ.21,384కోట్లు), సెస్‌ కింద రూ.8,476కోట్లు వసూలయ్యాయి. విక్రయాలకు సంబంధించి దాఖలయ్యే రిటర్నరులు(జీఎస్‌టీఆర్‌-3బీ) 73.48లక్షలకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక […]

ఫిబ్రవరిలో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2019 | 6:50 PM

Share

దిల్లీ: ఫిబ్రవరి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు తగ్గాయి. గత నెలలో రికార్డు స్థాయిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రూ.97,247కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా అందులో కేంద్ర జీఎస్‌టీ(సీజీఎస్‌టీ) రూ.17,626కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ) రూ.24,192కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ(ఐజీఎస్‌టీ) రూ.46,953కోట్లు(దిగుమతుల మీద వసూలైన సెస్‌ కింద రూ.21,384కోట్లు), సెస్‌ కింద రూ.8,476కోట్లు వసూలయ్యాయి. విక్రయాలకు సంబంధించి దాఖలయ్యే రిటర్నరులు(జీఎస్‌టీఆర్‌-3బీ) 73.48లక్షలకు చేరాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి జీఎస్‌టీ వసూళ్ల ద్వారా ప్రభుత్వం రూ.10.70 లక్షల కోట్లు సమీకరించింది. బడ్జెట్‌లో ప్రభుత్వం వార్షిక జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని రూ.13.48లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది. గత నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02లక్షల కోట్లు వచ్చాయి. ఒక నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటడం ఇది మూడోసారి. గతేడాది ఏప్రిల్‌, అక్టోబరులో ఈ స్థాయిని అధిగమించాయి.