జీహెచ్ఎంసీకి డిజిటల్‌ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇప్పటికే పలుమార్లు మంచి పేరు తెచ్చుకున్న జీహెచ్‌ఎంసీకి  మరో అవార్డు దక్కింది. పారదర్శక సేవల్లో భాగంగా అందిస్తోన్న సాంకేతిక సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) బల్దియాకు జాతీయ స్థాయిలో డిజిటల్‌ ఇండి యా అవార్డు ప్రకటించింది. పౌర సేవల్లో సాంకేతికతను వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నందుకుగాను పురస్కారం దక్కిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పౌర సమస్యల పరిష్కారంలో భాగం గా ఫిర్యాదుల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ ద్వారా […]

జీహెచ్ఎంసీకి డిజిటల్‌ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Follow us

|

Updated on: Feb 22, 2019 | 6:52 PM

హైదరాబాద్‌: ఇప్పటికే పలుమార్లు మంచి పేరు తెచ్చుకున్న జీహెచ్‌ఎంసీకి  మరో అవార్డు దక్కింది. పారదర్శక సేవల్లో భాగంగా అందిస్తోన్న సాంకేతిక సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) బల్దియాకు జాతీయ స్థాయిలో డిజిటల్‌ ఇండి యా అవార్డు ప్రకటించింది. పౌర సేవల్లో సాంకేతికతను వినియోగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నందుకుగాను పురస్కారం దక్కిందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. పౌర సమస్యల పరిష్కారంలో భాగం గా ఫిర్యాదుల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌ ద్వారా వచ్చిన రెండు లక్షల ఫిర్యాదులను గతేడాది పరిష్కరించారు.
ఏడు లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దేశంలో ఈ స్థాయిలో యాప్‌ను వినియోగించుకునే నగరం ఏదీ లేదని, అందుకే కేంద్రం అవార్డుకు ఎంపిక చేసిందని అధికారులు చెబుతున్నారు. యాప్‌తోపాటు ఆన్‌లైన్‌లో నిర్మాణ అనుమతుల జారీ, పన్నుల వసూలు, వాతావరణ వివరాలు, పోలింగ్‌ కేంద్రాల వివరాలు, స్వచ్ఛతా సమస్యలకూ సాంకేతికత వినియోగిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌ఐసీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నీతా వర్మ ఆహ్వానం పంపింది. ఐటీ అదనపు కమిషనర్‌ ముషారఫ్‌ అలీని డిజిటల్‌ అవార్డు ల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ అవార్డు అందజేయనున్నారు. జీహెచ్‌ఎంసీకి డిజిటల్‌ అవార్డు రావడంపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, కమిషనర్‌ దానకిషోర్‌ హర్షం వ్యక్తం చేశారు.

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు