AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటర్ల సమాచారం కోసం డయల్ చేయండి టోల్ ఫ్రీ నంబర్ 1950

పోలింగ్‌స్టేషన్ ఎక్కడుందో..?  అనే చింత ఇక అక్కరలేదు. పోలింగ్ స్టేషన్‌ సమాచారం తెలుసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 1950 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అంతే కాకుండా 9223166166 నంబర్‌కు SMS కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎన్నికల గుర్తింపు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్ టైప్ చేసి SMS చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం తెలుస్తుందని వెల్లడించారు. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ […]

ఓటర్ల సమాచారం కోసం డయల్ చేయండి టోల్ ఫ్రీ నంబర్ 1950
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2019 | 6:01 PM

Share

పోలింగ్‌స్టేషన్ ఎక్కడుందో..?  అనే చింత ఇక అక్కరలేదు. పోలింగ్ స్టేషన్‌ సమాచారం తెలుసుకోవడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నంబర్ 1950 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అంతే కాకుండా 9223166166 నంబర్‌కు SMS కూడా చేయవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు తన ఎన్నికల గుర్తింపు కార్డుపై ఉన్న ఎపిక్ నంబర్ టైప్ చేసి SMS చేస్తే వెంటనే పోలింగ్‌స్టేషన్ సమాచారం తెలుస్తుందని వెల్లడించారు. అలాగే ఈసీఐ రూపొందించిన నాఓట్ యాప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చిన ఈసీ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఎక్కువమంది పోటీలో ఉన్నందున ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. నిజామాబాద్‌లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తరువాత పోలింగ్ మొదలవుతుంది.