నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. శ్రీశైలం – హైదరాబాద్ రహదారి ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు దూరంలోని NHA పై ఈ ప్రమాదం తలెత్తింది. అక్టోపస్ నుండి నిలాకరం బండ వరకు అడవిని చుట్టుముట్టి మంటలు ఎగిసి పడుతున్నాయి. అధునాతనమైన పరికారాలతో, అటవీశాఖ సిబ్బంది అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు.. బాటసారులకు అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్ పై ఎలాంటి మంటలు వెలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.