AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా గోల్లప్రోలు వద్ద యశ్వంత్ పూర్ – టాటానగర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీకార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కాసేపట్లోనే భారీ ఎత్తున వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ను లాగి రైలును నిలిపివేశారు. అయితే.. అప్పటికే రెండు, మూడు బోగీలకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమయిన ప్రయాణికులు మంటలార్పే ప్రయత్నం చేశారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రైలు ప్రమాదంతో ఒకే లైన్ ద్వారా అధికారులు రైళ్ల రాకపోకలు […]

యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో  అగ్నిప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:40 PM

Share

తూర్పుగోదావరి జిల్లా గోల్లప్రోలు వద్ద యశ్వంత్ పూర్ – టాటానగర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీకార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కాసేపట్లోనే భారీ ఎత్తున వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ను లాగి రైలును నిలిపివేశారు. అయితే.. అప్పటికే రెండు, మూడు బోగీలకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అప్రమత్తమయిన ప్రయాణికులు మంటలార్పే ప్రయత్నం చేశారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రైలు ప్రమాదంతో ఒకే లైన్ ద్వారా అధికారులు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రం చేరేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు ఆలస్యమైందని సిబ్బంది పేర్కొన్నారు.