న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొచ్చుకెళ్లి బాంబుల వర్షం కురిపించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడి పరిణామాల క్రమంలో వాటి గురించి తమకు తెలిసిందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముఖ్యంగా మూడు ప్రాంతాలపై భారత్ దాడి చేసింది. అవి బాలా కోట్, చకోటి, ముజఫాబాద్. వీటిలో మొదటిగా, ఎక్కువగా దాడి చేసింది మాత్రం బాలాకోట్ ప్రాంతంలోనే. అయితే ఈ ప్రాంతాన్ని భారత్ ఎందుకు టార్గెట్ చేసింది?
ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. జేషే మహ్మద్ సంస్థకు సంబంధించిన స్థావరాలు ఇక్కడే పెద్ద ఎత్తున ఉన్నాయి. అంతే కాదు ఇక్కడి నుంచి పుల్వామా దాడి తరహాలో మరిన్ని ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ పథకం పన్నుతుందని భారత ఇంటిలిజెన్స్కు సమాచారం అందిందట. అందుకే ఆ ప్రాంతాన్ని మన వైమానిక దళం ఎక్కువగా టార్గెట్ చేసింది.