పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్పై డాషింగ్ అండ్ డేరింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో స్పందించాడు. తన పొకిరి సినిమాలోని డైలాగ్(బుల్లెట్…దిగిందా? లేదా) అంటూ పాకిస్థాన్కు వ్యంగ్యంగా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చాడు. గుస్..గుస్ కే మార్ దియా అంటూ తనదైన శైలిలో డైలాగులు పేల్చాడు జగన్. చివర్లో సెల్యూట్ టూ ఇండియన్ ఆర్మీ…జనగణమణ అంటూ ట్వీట్ను ముగించి తన దేశభక్తిని చాటుకున్నాడు. స్వతహాగా ఆవేశపరుడైన పూరి జగన్నాథ్, తన మూవీస్లో ఆ పంథాను చూపిస్తూనే ఉంటాయి. ఎంతైనా పూరి స్టైయిల్ ఏ వేరంటూ మురిసిపోతున్నారు ఆయన ఫ్యాన్స్.
BULLET DIGINDA LEDA?
Ghuss ghuss ke maar Diya ..
????salute to
INDIAN AIRFORCE?
JANAGANAMANA pic.twitter.com/uGqojrzPzh— PURIJAGAN (@purijagan) February 26, 2019