బంగారానికి మెరుగు పెడుతామని వచ్చి..పుస్తెల తాడుతో ఎస్కేప్

|

Nov 10, 2019 | 4:59 AM

క్రైమ్ ఎలా జరుగుతుందో రోజూ చూస్తూనే ఉంటాం..మనవరకూ వచ్చినప్పుడు మాత్రం అందరిలానే మోసపోతాం. రైస్ పుల్లింగ్, ట్రెజర్ హంట్ వాటికి  ఆశపడి చిత్తయిపోతున్న వారు కోకొల్లలు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకొక మార్గంలో క్రైమ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా బంగారానికి మెరుగుపెడతామంటూ ఇంటికి వచ్చిన దుండగుడు మహిళ పుస్తెల తాడుతో ఎస్కేప్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే…మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు కలియతిరిగారు. […]

బంగారానికి మెరుగు పెడుతామని వచ్చి..పుస్తెల తాడుతో ఎస్కేప్
Follow us on

క్రైమ్ ఎలా జరుగుతుందో రోజూ చూస్తూనే ఉంటాం..మనవరకూ వచ్చినప్పుడు మాత్రం అందరిలానే మోసపోతాం. రైస్ పుల్లింగ్, ట్రెజర్ హంట్ వాటికి  ఆశపడి చిత్తయిపోతున్న వారు కోకొల్లలు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకొక మార్గంలో క్రైమ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా బంగారానికి మెరుగుపెడతామంటూ ఇంటికి వచ్చిన దుండగుడు మహిళ పుస్తెల తాడుతో ఎస్కేప్ అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే…మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు కలియతిరిగారు. బంగారం, వెండి, ఇత్తడి వస్తువులుకు మెరుగుపెడతామని చెప్పడంతో..అదే గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ..కాలి మెట్టెలను మెరుగుపెట్టించింది. అవి జిగేల్‌గా మెరిసిపోతుండటంతో..వెంటనే మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు కూడా ఇచ్చి మెరుగు పెట్టాల్సిందిగా కోరింది. దీంతో అప్పటి వరకు మాములుగా ఉన్న ఎదుటి వ్యక్తి..విక్రమార్కుడు సినిమాలో.. అత్తిలి చిరబరానందస్వామిగా మారిపోయాడు. మెరుగు పెట్టినట్టుగా యాక్ట్ చేసి..తాడుకి పసుపు పూసి..వెంటనే కడిగితేే సరిగ్గా షైన్ ఉండదని..ఒక గంట తర్వాత నీటితో కడగమని చెప్పి వెళ్లిపోయారు. ఆ మహిళ గంట తర్వాత దాన్ని కడగగా గొలుసు నలుపు రంగులోకి మారిపోయింది. టెన్షన్ పడ్డ ఆమె..బంగారం చేయించిన షాపు దగ్గరికి వెళ్లి అడగ్గా..అది బంగారం కాదు..గిల్టుదని తేల్చి చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళ లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసింది. చూశారుగా ఆదమరిచారో జాదుగాళ్ల వలలో పడతారు. బి కేర్‌ఫుల్.