AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-పాక్ గొడవల కారణంగా ఆగిపోయిన పెళ్లి

రాజస్థాన్: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు పాక్ లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన చగన్ కర్వార్ అనే యువతికి ఈ నెల 8న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీసాలు కూడా తీసుకున్నారు. అయితే అంతలోనే పరిస్థితి మారిపోయింది. పుల్వామా ఉగ్రదాడి మొదలుకొని అభినందన్ భారత్‌కు తిరిగి క్షేమంగా […]

భారత్-పాక్ గొడవల కారణంగా ఆగిపోయిన పెళ్లి
Vijay K
|

Updated on: Mar 04, 2019 | 5:17 PM

Share

రాజస్థాన్: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓ పెళ్లి ఆగిపోయింది. రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్‌కు పాక్ లోని సింధ్ ప్రావిన్సుకు చెందిన చగన్ కర్వార్ అనే యువతికి ఈ నెల 8న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీసాలు కూడా తీసుకున్నారు.

అయితే అంతలోనే పరిస్థితి మారిపోయింది. పుల్వామా ఉగ్రదాడి మొదలుకొని అభినందన్ భారత్‌కు తిరిగి క్షేమంగా వచ్చేంత వరకూ ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితి చక్కబడ్డాకనే తాము వివాహం చేసుకుంటామని పెళ్లి కుమారుడు మహేంద్ర సింగ్ చెబుతున్నాడు.