AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబుకు బర్త్‌డే షాక్.. కుప్పంలో ఏంజరిగిందంటే?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్ డే ఏప్రిల్ 20. సరిగ్గా ఇదే రోజున ఆయనకు షాకిచ్చారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ నేతలు.

బాబుకు బర్త్‌డే షాక్.. కుప్పంలో ఏంజరిగిందంటే?
Rajesh Sharma
|

Updated on: Apr 20, 2020 | 5:08 PM

Share

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బర్త్ డే ఏప్రిల్ 20. సరిగ్గా ఇదే రోజున ఆయనకు షాకిచ్చారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ నేతలు. షాకిచ్చేందుకు ఆయన బర్త్ డే రోజే దొరికిందా అంటూ మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు.

సోమవారం పుట్టిన రోజును అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు చంద్రబాబు. కరోనా ప్రభావంతో దేశం యావత్తు టెన్షన్‌లో వున్నప్పుడు ఆడంబరాలు వద్దనుకున్నారు చంద్రబాబు. అదే విషయాన్ని పార్టీ శ్రేణులకు చేర్చడంతో ఎక్కడా పెద్దగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించలేదు పార్టీ క్యాడర్. గతనెల రోజులుగా హైదరాబాద్‌ నివాసంలో వుంటున్న చంద్రబాబు సోమవారం అత్యంత నిరాడంబరంగా బర్త్ డే కేక్ కట్ చేశారు.

ఇదిలా వుంటే.. కుప్పంలోని వైసీపీ క్యాడర్ మాత్రం చంద్రబాబుకు బర్త్ డే గిఫ్టు కింద షాకిచ్చారు. గత కొన్నాళ్ళుగా తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ సరిగ్గా బాబు పుట్టిన రోజునాడే కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కరోనా సమయంలో కుప్పం ప్రజలకు చంద్రబాబు ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్న వైసీపీ మైనార్టీ విభాగం నేత ఫైరోజ్ బాషా తదితరులు పోలీసులకు తమ ఫిర్యాదును అందజేశారు. అయితే.. హైదరాబాద్‌లో ఆనందంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తమ అధినేతపై ఫిర్యాదు చేయడంపై తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. ఇలాంటి రాజకీయ డ్రామాలాడేందుకు ఆయన బర్త్ డే రోజే దొరికిందా అని ప్రశ్నిస్తున్నారు.