
జ్యేష్ఠ మాసంలో వచ్చే వట పౌర్ణమి హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలకు అత్యంత పవిత్రమైన వ్రతం(వట సావిత్ర వ్రతం)గా భావిస్తారు. ఈ రోజున స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ఉపవాసం ఉండి మర్రిచెట్టును (వటవృక్షం) భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సావిత్రి–సత్యవాన్ గాథకు ప్రతీకగా ఈ వ్రతం దేశంలోని చాలా ప్రాంతాల్లోఅత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే 2026లో వట పౌర్ణమి జూన్ 29న జరుపుకోవాలా? లేక జూన్ 30న పాటించాలా? అనే సందేహం చాలామందిలో ఉంది. పంచాంగ వివరాల ప్రకారం సరైన తేదీ ఏదో తెలుసుకుందాం.
దృక్ పంచాంగం ప్రకారం..
హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే అదే రోజున వ్రతాన్ని ఆచరిస్తారు. జూన్ 29న సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఉండటంతో 2026 వట పౌర్ణమి వ్రతాన్ని జూన్ 29, సోమవారం రోజునే పాటించాలి.
హిందూ ధర్మంలో మర్రిచెట్టును అమరత్వం, దీర్ఘాయువు, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ వృక్షంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని విశ్వసిస్తారు.
వటవృక్షాన్ని పూజించడం వల్ల.. భార్యాభర్తల బంధం మరింత బలపడుతుందని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని, అడ్డంకులు తొలగి శుభఫలితాలు కలుగుతాయని, కుటుంబ శ్రేయస్సు, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
వట పౌర్ణమి రోజున ఈ విధంగా పూజ చేస్తే శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు.
వట పౌర్ణమి వ్రతం సావిత్రి–సత్యవాన్ పౌరాణిక గాథతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. తన భర్త సత్యవానుడి ప్రాణాలను యమధర్మరాజు నుంచి తన అచంచలమైన పతివ్రత్యం, భక్తి, ధైర్యం, పట్టుదలతో తిరిగి పొందిన సావిత్రి ఆదర్శాన్ని స్మరించుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
అందుకే వివాహిత మహిళలు ఈ రోజున ఉపవాసం ఉండి మర్రిచెట్టును పూజించడం ద్వారా తమ భర్తలకు దీర్ఘాయుష్షు, కుటుంబానికి సుఖశాంతులు, దాంపత్య జీవితానికి మంగళం కలగాలని ప్రార్థిస్తారు. ఈ వ్రతం భక్తి మాత్రమే కాకుండా అంకితభావం, సహనం, కుటుంబ విలువలు, దాంపత్య బంధం గొప్పతనాన్ని గుర్తు చేసే పవిత్ర ఆచారంగా హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం పొందింది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)