Lord Shani: జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..

శని దోషం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ లోపాలలో అనేక రకాలు ఉన్నాయి. వీటి వలన కలిగే పరిణామాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. వీటిలో శని దోషం ఒకటి. శని ప్రభావంతో ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే.. వారు శని దోషాన్ని నివారించడానికి మార్గాల గురించి ఆలోచించాలి. అందుకోసం శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వీటిని జపిచడం వలన ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.

Lord Shani: జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..
Lord Shani Dev

Updated on: Oct 05, 2024 | 4:14 PM

నవ గ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మ ప్రదాత అని పిలుస్తారు. శనీశ్వరుడి మంద గమనుడు.. అతి నెమ్మదిగా కదిలే గ్రహం.. ఎవరి జాతకంలో శని దోషం, ఏలి నాటి శని ఉంటుందో వారు జీవితంలో అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ నేపద్యంలో శని దోష నివారణకు శనివారం శనీశ్వరుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. శనీశ్వరుడి ప్రతి ఒక్కరిపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు. శని దోషం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ లోపాలలో అనేక రకాలు ఉన్నాయి. వీటి వలన కలిగే పరిణామాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. వీటిలో శని దోషం ఒకటి. శని ప్రభావంతో ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే.. వారు శని దోషాన్ని నివారించడానికి మార్గాల గురించి ఆలోచించాలి. అందుకోసం శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. వీటిని జపిచడం వలన ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు.

శని దోషం అంటే ఏమిటి?

శని నెమ్మదిగా కలిదే గ్రహం… ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి శనీశ్వరుడు రెండున్నర ఏళ్లు తీసుకుంటాడు. ఎవరి జాతకంలో చంద్రుడి రాశి నుంచి నుంచి నాలుగో రాశిలో శని సంచరించడాన్ని అర్ధాష్టమ శని అనీ వ్యవహరిస్తారు. అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సమయంలో శని ప్రభావం వ్యక్తులపై కనిపించడం ప్రారంభమవుతుంది. వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది. ఆర్థిక, శారీరక వరకు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరి జీవితంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మంచిపనులు చేయడానికి ప్రయత్నించాలి.

శని దోష నివారణకు ఏమి చేయాలంటే

శని దోషం నుండి బయటపడటానికి కొన్ని మంత్రాలను జపించాలి. ‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్., ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృతాత్. ఇది ఒక మహామంత్రం పఠించడం ద్వారా శని దోషం వలన కలిగే సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ మంత్రం చాలా ప్రయోజనకరమైనది . దీనిని ప్రతి శనివారం పఠించాలి.

ఇవి కూడా చదవండి

శనివారం ఈ వస్తువులను దానం చేయండి

శనివారం రోజున విరాళాలు ఇవ్వడం వలన శనీశ్వరుడి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున నలుపు రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయవచ్చు. అంతే కాకుండా ఈ రోజున నల్ల ఉసిరి లేదా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఆవాలు లేదా నువ్వుల నూనెను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇనుప వస్తువులను కూడా దానం చేయవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

Loading...
Unable to load recommendations.
Follow Us