ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఈ నెల 29న వారి ఖాతాల్లోకి రూ. 2 వేలు జమ.!!

| Edited By: Pardhasaradhi Peri

Dec 19, 2020 | 6:00 PM

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.

ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. ఈ నెల 29న వారి ఖాతాల్లోకి రూ. 2 వేలు జమ.!!
CM-Jagana-Farmers
Follow us on

YSR Raithu Bharosa Scheme: ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 50.47 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున సుమారు రూ. 1,009 కోట్లు చెల్లించనుంది. ఇదిలా ఉంటే గతంలో వైఎస్సార్ రైతు భరోసా పధకం కింద రెండు విడతల్లో రైతులకు రూ. 11,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నవంబర్‌లో వచ్చిన నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు కూడా ఈ నెల 29వ తేదీన సుమారు రూ.718 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం అందించనుంది.

Also Read:

సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..