
Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాశావరణ శాఖ అదికారులు వెల్లడించారు. శ్రీలంకం తీరం నుంచి ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం వరకు ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 0.9 ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందన్నారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని దక్షిణ కోస్రాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్త్రాంధ్రలో ఇవాళ పోడి వాతావరణం ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ అధికారులు.. శనివారం నాడు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
Also read:
Nagarjuna Sister : మరోసారి మాజీ మిస్ ఇండియాను టాలీవుడ్ కు తీసుకొస్తున్న కింగ్ నాగార్జున