టిక్‌ టాక్ పిచ్చి.. నదిలో కొట్టుకుపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!

చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరుగుతోంది. ఈ పిచ్చిలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ చేస్తూ చెక్‌ డ్యాం వరద నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేసేందుకు దినేష్, గంగాజలం, మనోజ్ గౌడ్ అనే ముగ్గురు యువకులు వాగులోకి దిగారు. టిక్ టాక్ చేసిన తర్వాత […]

టిక్‌ టాక్ పిచ్చి.. నదిలో కొట్టుకుపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 2:30 PM

చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరుగుతోంది. ఈ పిచ్చిలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ చేస్తూ చెక్‌ డ్యాం వరద నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేసేందుకు దినేష్, గంగాజలం, మనోజ్ గౌడ్ అనే ముగ్గురు యువకులు వాగులోకి దిగారు. టిక్ టాక్ చేసిన తర్వాత చేపలు కూడా పట్టారు. ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వారు ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. అది గమనించిన ఒడ్డున ఉన్న కొందరు.. చీరలు అందించి గంగాజలం, మనోజ్ గౌడ్‌లను కాపాడారు. కానీ వరద ఉధృతికి దినేష్ కొట్టుకుపోయాడు. దీంతో అతడి కోసం వాగులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, దినేష్ కుటుంబసభ్యులు, అధికారులు చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. కాగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న దినేష్ నెల కిందటే సొంతూరుకు వచ్చాడు. మరో నెలలో అతడు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో… తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..