AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్‌ టాక్ పిచ్చి.. నదిలో కొట్టుకుపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!

చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరుగుతోంది. ఈ పిచ్చిలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ చేస్తూ చెక్‌ డ్యాం వరద నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేసేందుకు దినేష్, గంగాజలం, మనోజ్ గౌడ్ అనే ముగ్గురు యువకులు వాగులోకి దిగారు. టిక్ టాక్ చేసిన తర్వాత […]

టిక్‌ టాక్ పిచ్చి.. నదిలో కొట్టుకుపోయిన యువకుడు.. అసలేం జరిగిందంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 22, 2019 | 2:30 PM

Share

చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరుగుతోంది. ఈ పిచ్చిలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ చేస్తూ చెక్‌ డ్యాం వరద నీటిలో కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పలవాగు చెక్ డ్యామ్ వద్ద టిక్ టాక్ చేసేందుకు దినేష్, గంగాజలం, మనోజ్ గౌడ్ అనే ముగ్గురు యువకులు వాగులోకి దిగారు. టిక్ టాక్ చేసిన తర్వాత చేపలు కూడా పట్టారు. ఇంతలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వారు ముగ్గురు నీటిలో కొట్టుకుపోయారు. అది గమనించిన ఒడ్డున ఉన్న కొందరు.. చీరలు అందించి గంగాజలం, మనోజ్ గౌడ్‌లను కాపాడారు. కానీ వరద ఉధృతికి దినేష్ కొట్టుకుపోయాడు. దీంతో అతడి కోసం వాగులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు, దినేష్ కుటుంబసభ్యులు, అధికారులు చెక్ డ్యాం వద్దకు చేరుకున్నారు. కాగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న దినేష్ నెల కిందటే సొంతూరుకు వచ్చాడు. మరో నెలలో అతడు దుబాయ్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో… తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.