ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం
గతంలో పార్శిల్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ఆర్టీసీ.. ప్రస్తుతం తనే పార్శిల్ సేవలను చేపట్టింది. ఆర్టీలో కార్గో, కొరియర్ సేవలకు మంచి స్పందన వస్తుండటంతో..ఆదిలాబాద్ జిల్లాలోని..
గతంలో పార్శిల్ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ఆర్టీసీ.. ప్రస్తుతం తనే పార్శిల్ సేవలను చేపట్టింది. ఆర్టీలో కార్గో, కొరియర్ సేవలకు మంచి స్పందన వస్తుండటంతో.. ఈ సేవలను మరింత విస్తరించాలని యోచిస్తోంది. అందులో భాగంగా జిల్లాల వారిగా సేవలను ప్రారంభిస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది.
ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో ఆర్టీసీ కార్గో పార్సి ల్, కొరియర్ సర్వీస్ను ఏర్పాటుచేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ రిబ్బన్ కట్ చేసి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ డివికే.మూర్తి మాట్లాడుతూ బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ బస్ స్టేషన్లలో, ప్రధాన కూడళ్ళలో కొరియర్ సర్వీస్లను ప్రారంభించినట్లు తెలిపారు. టేకులబస్తీ, కాల్టెక్స్ తదితర ప్రాంతాలలో పార్సిల్ సర్వీస్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.