అఙ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ సుధాకర్..!

| Edited By:

Jun 07, 2020 | 5:02 PM

ఇటీవలే మానసిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన డాక్టర్ సుధాకర్ అఙ్ఞాతంలోకి వెళ్లారు. మానసిక ప్రశాంతత కోసం వైజాగ్‌లోని ఓ రహస్య ప్రదేశంలోకి ఆయన వెళ్లినట్లు సమాచారం.

అఙ్ఞాతంలోకి వెళ్లిన డాక్టర్ సుధాకర్..!
Follow us on

ఇటీవలే మానసిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన డాక్టర్ సుధాకర్ అఙ్ఞాతంలోకి వెళ్లారు. మానసిక ప్రశాంతత కోసం వైజాగ్‌లోని ఓ రహస్య ప్రదేశంలోకి ఆయన వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్బంగా తనకు మద్దతు పలికేందుకు వచ్చే వారిని ఐదు రోజుల దాకా రానివ్వకూడదని సన్నిహితుల దగ్గర సుధాకర్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే డాక్టర్ సుధాకర్‌ని మెంటల్ ఆసుపత్రిలో ఎవరు చేర్పించారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయనే స్వయంగా ఆసుపత్రికి వచ్చారంటూ విశాఖలోని ప్రభుత్వం మానసిక ఆసుపత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్ రాధారాణి ప్రకటనలో తెలిపారు. మరోవైపు సుధాకర్‌ను పోలీసులు కేజీహెచ్‌కి తీసుకురాగా.. ఓపీలో చూశామని, అక్కడ ఆయన హడావిడి చేయడంతో మెంటల్ ఆసుపత్రికి పంపామని, పోలీసులే ఆయనను వాహనంలో తీసుకెళ్లారని కేజీహెచ్‌ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఇక సుధాకర్ కేసులో విచారణ చేస్తున్న సీబీఐ.. ఈ విషయంపై కూడా దృష్టిని సారించింది.

Read This Story Also: సోషల్ మీడియా నుంచి తప్పుకున్న స్టార్‌ హీరో..!