కామాంధులకు మరో బాలిక బలి..

| Edited By:

Mar 22, 2019 | 12:16 PM

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల ప్రవళిక అనే బాలికపై ఇంటి పక్కనే ఉండే బీహార్‌కు చెందిన వ్యక్తులు అత్యాచారం చేసి.. దారుణంగా గొంతు కోసి చంపేశారు. తర్వాత పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని డెడ్‌బాడీని పడేశారు. హోలీ ఆడుకున్న తర్వాత బాలిక ఎంతకూ కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]

కామాంధులకు మరో బాలిక బలి..
Follow us on

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల ప్రవళిక అనే బాలికపై ఇంటి పక్కనే ఉండే బీహార్‌కు చెందిన వ్యక్తులు అత్యాచారం చేసి.. దారుణంగా గొంతు కోసి చంపేశారు. తర్వాత పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని డెడ్‌బాడీని పడేశారు. హోలీ ఆడుకున్న తర్వాత బాలిక ఎంతకూ కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల గాలించారు. అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ పక్కల వెతుకుతుండగా డెడ్ బాడీ కనిపించింది. స్పాట్‌ను పరిశీలించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేయించగా.. డాగ్స్ నేరుగా ప్రవళిక ఇంటిపక్కనే ఉన్న బీహార్‌కు చెందిన వ్యక్తుల ఇంటికి వెళ్లాయి. వెంటనే నిందితులను అదుపలోకి తీసుకున్నారు పోలీసులు.