త్వరలో 2 వేల రూపాయల నోట్లు రద్దు.. త్వరపడండి..! కట్‌ చేస్తే..!!

శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మహబూబ్, నార్సింగ్ కి చెందిన కొలంపల్లి శ్రీనివాస్, ఉప్పల్ కి చెందిన బింగి వాసు, ఎల్బీ నగర్ కి చెందిన సింగం శెట్టి రాములు లను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు.

త్వరలో 2 వేల రూపాయల నోట్లు రద్దు.. త్వరపడండి..!  కట్‌ చేస్తే..!!
Two Thousand

Updated on: Apr 15, 2023 | 5:46 PM

త్వరలో 2 వేల రూపాయల నోట్లు రద్దు… త్వరపడండి.. అంటూ మోసం చేస్తున్న గ్యాంగ్ ని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. అమాయకులను టార్గెట్ చేస్తూ.. కోటి 90 లక్షలు దోచుకుంది ఈ ముఠా. శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మహబూబ్, నార్సింగ్ కి చెందిన కొలంపల్లి శ్రీనివాస్, ఉప్పల్ కి చెందిన బింగి వాసు, ఎల్బీ నగర్ కి చెందిన సింగం శెట్టి రాములు లను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. మీ దగ్గరున్న 2 వేల నోటు ఇస్తే.. 20 శాతం అదనంగా 500 నోట్లు ఇస్తామని మోసాలకు పాల్పడ్డారు.

లక్ష రూపాయల 2 వేల నోట్లు ఇస్తే.. లక్షా 20 వేల విలువైన 500 నోట్లు ఇస్తామని వ్యాపారులను నమ్మించి మోసాలకు పాల్పడ్డారు ఈ ముఠా సభ్యులు. పలువురు వ్యాపారుల నుంచి 2 వేల నోట్ల రూపంలో కోట్ల రూపాయలు దండుకుని పరార్ అవ్వాలని ఈ ముఠా ప్లాన్ చేశారు. పక్కా సమాచారం మేరకు ఈ ముఠాని పట్టుకుని కోటి 90 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us