ఏలూరు: కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు పరార్..
కోవిడ్-19 సోకడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి ఎస్కేప్ అయ్యారు. ఈ పరారైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
Andhra Pradesh : కోవిడ్-19 సోకడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి ఎస్కేప్ అయ్యారు. ఈ పరారైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. ఏలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న 13 మంది ఖైదీలకు ఇటీవల చేసిన టెస్టుల్లో కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది . దీంతో వీరిని సీఆర్ఆర్ కోవిడ్ కేర్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిట్యువేషన్ ఉపయోగించుకున్న ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఎస్కార్ట్ సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
దీంతో షాక్ తిన్న కోవిడ్ సెంటర్ సిబ్బంది, జైలు అధికారులు వెంటనే ఏలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఖైదీలు ఎలా తప్పించుకున్నారో ఓ అంచనాకు వచ్చారు. వీరివురూ పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు తప్పించుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కోవిడ్ కేర్ సెంటర్ వద్ద నిఘాను పెంచారు.
ఇది కూడా చదవండి : ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..