Watch: ఇదేం పిచ్చిరా.. తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్తం ఫోటో షూట్.. సీన్.. కట్చేస్తే!
రోజురోజుకూ జనాల్లో రిల్స్ పిచ్చి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామో కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుమల శ్రీవారి సన్నిధిలో వెలుగు చూసింది. శ్రీవారి ఆయల ప్రాంగణంలో నిబంధనలకు విరుద్దంగా ఒక కొత్త జంట రీల్స్ చేయడం కలకలం రేపింది.

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు జనాలు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఓ జంట ఫోటో షూట్ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. జంట తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్రర్తించడంపై ఆలయ అధికారులు సైతం మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కళియుగ వైకుంఠ దైవం శ్రీవారి ఆలయ పరిసరాల్లో గురువారం కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ జంట ఫోటో షూట్ చేసుకున్నారు. గొల్లమండపం నుండి అఖిలాండం వరకు రకరకాల ఫోజ్లలో ఫోటోలు దిగితూ, వీడియోలు తీసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగే విధంగా, నిబంధనలకు విరుద్దంగా నుదుటిపై ముద్దు పెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రాంగణంలో ఇలా ఫోటోలు తీసుకోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే టీటీడీ సిబ్బంది తీరుపై కూడా భక్తులు మండిపడుతున్నారు. ఆయల పరిసరాల్లో రీల్స్, వీడియోలు, ఫోటోలు తీయడం నిషేదం ఉన్నప్పటికీ.. ఎలా అనుమతించారని.. ఇక్కడ ఫోటోలు తీస్తుంటే ఆలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
