గుంటూరు జిల్లాలో(Guntur district) వెనువెంటనే జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో మరో యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. ప్రత్తిపాడు(Prathipadu) మండలం యనమదల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ప్రమాద విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నెలకొంది. ఈ క్రమంలో వాహనాలు రాకపోకలకు రూట్ క్లియర్ చేస్తున్న సమయంలో పాల వ్యాన్ వేగంగా దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో హోంగార్డుతో పాటు లారీ యజమాని మరణించాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించేందుకు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..