TDP Leaders Protest: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గమన్నారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ విజయనగరంలో టీడీపీ నేతలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం చేసి వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే దిష్టిబొమ్మ దగ్ధంను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అయితే, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదితి గజపతిరాజు సహా 26 మందిపై కేసు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇవాళ మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే దేవుళ్ల విగ్రహాలు విధ్వంసానికి గురవుతున్నాయని టీడీపీ నేతలంటుంటే.. విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నేతలే ఉన్నారంటూ మంత్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
Also read:
corona in chittoor : చిత్తూరులో స్ట్రెయిన్ కలకలం.. యూకే నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్..