corona in chittoor : చిత్తూరులో స్ట్రెయిన్ కలకలం.. యూకే నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్..
కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా యుకె నుంచి వచ్చిన చిత్తూరు..
corona in chittoor district : కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూకే నుంచి వచ్చిన చిత్తూరు యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయంది. జిల్లాలోని మిట్టూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత నెల 21న చిత్తూరుకు వచ్చాడు. అయితే ఆసమయంలో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. విదేశాలనుంచి రావడంతో అతడిని హౌమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో మరోసారి అతడికి కరోనా టెస్ట్ నిర్వహించారు. ఈ సారి పాజిటివ్ గా తేలింది. వెంటనే అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కొత్త వైరస్ స్ట్రెయిన్ అయ్యుండొచ్చని అనుమానంతో రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపారు.
also read : Corona Affect The Brain: పరిశోధనల్లో షాకింగ్ నిజాలు.. మెదడుపై ప్రభావం చూపుతోన్న మహమ్మారి..