టీడీపీ ఏపీ అధ్యక్షుడు, సీనియర్ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. అక్రమ అరెస్టులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు.
టీడీపీ నేతలు బయట ఉంటే వైసీపీ నేతల ఆటలు సాగవని అందుకే కీలక నేతలందరినీ ముందస్తుగా అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతల అరాచకాలను పోలీసులకు కనిపించడం లేదా అని బోండా ఉమా ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వారి తీరు మారట్లేదని అన్నారు.
ఏపీలో టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టి రాజకీయం చేయాలనుకుంటోందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ భావిస్తుందని విమర్శించారు. ఓటమి భయంతోనే వైసీపీ టీడీపీ నేతలను అరెస్టులు చేయిస్తుందని చెప్పారు. అక్రమ అరెస్టులకు టీడీపీ భయపడతని చెప్పారు.
అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన సోమిరెడ్డి… కింజారపు కుటుంబంపై అందుకే కక్ష గట్టారన్న మాజీమంత్రి