అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన సోమిరెడ్డి… కింజారపు కుటుంబంపై అందుకే కక్ష గట్టారన్న మాజీమంత్రి

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు, సీనియర్‌ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని మళ్లీ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి..

అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన సోమిరెడ్డి... కింజారపు కుటుంబంపై అందుకే కక్ష గట్టారన్న మాజీమంత్రి
Follow us

|

Updated on: Feb 02, 2021 | 12:01 PM

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు, సీనియర్‌ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని మళ్లీ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలకు ఇది పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ విషయంలో తన తమ్ముడికి అచ్చెన్నాయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుదరకపోతే నీ ఇష్టం అని వదిలేశారు. ఇదంతా వాయిస్ రికార్డై మీడియాలో కూడా ప్రసారమైంది. ఓవైపు ఏకగ్రీవాలు కావాలంటున్న మీరు.. ఆ ప్రయత్నం చేసిన అచ్చెన్నాయుడితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అనుచరులను అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులకు పనిలేకుండా పోయింది. ఇప్పుడు అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం తిరిగి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడిందని సోమిరెడ్డి విమర్శించారు. కింజారపు కుటుంబానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆ కుటుంబం ఏ రోజూ ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ దర్యాప్తునకు అచ్చెన్నాయుడు వేసిన కేసుతో ద్వేషం పెంచుకుని ఇదంతా చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వం వెనుక అండగా ఉందని అక్రమ కేసులు పెడితే చివరికి బాధ్యులయ్యేది పోలీసులేనని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడిపై వెంటనే కేసులు వెనక్కి తీసుకుని, ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.