Andhra: గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే.. సీక్రెట్‌గా కెమెరాతో..

ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ కొందరు ఆకతాయిలు దారుణాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కులు, గ్రామ శివారులు, ఖాళీ ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న యువత, ప్రేమ జంటలపై దాడులు చేస్తూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్ బట్టబయలైంది.

Andhra: గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే.. సీక్రెట్‌గా కెమెరాతో..
Representative Image

Edited By:

Updated on: Feb 04, 2026 | 12:41 PM

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొన్ని రోజులుగా ఓ గ్యాంగ్ ప్రేమ జంటలను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతుంది.. ఒంటరిగా కనిపించిన వారిని చుట్టుముట్టి.. మొబైల్ ఫోన్‌తో దొంగచాటుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతాం. ఇంటివారికి పంపిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. భయపడిన బాధితుల నుంచి వెంటనే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు. తాజాగా నందిగామ శివారులో ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటపై ఆకతాయిలు దాడి చేశారు. వారిని భయపెట్టి ఫోన్‌లను లాక్కొని వీడియోలు తీసి డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తామని బెదిరించారు.

అంతేకాదు మద్యం మత్తులో అక్కడికి వచ్చిన ఓ గ్రామానికి చెందిన వ్యక్తిని కూడా అనుమానం పేరుతో కొట్టి గాయపరిచారు. ఇలాంటి ఘటనలతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయకుండా మౌనంగా డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ గ్యాంగ్ మరింత రెచ్చిపోతూ వరుసగా దాడులకు పాల్పడుతుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్ వెనుక ఎవరున్నారు.. ఎంతమంది బాధితులు ఉన్నారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంటలు యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి బెదిరింపులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..