
కృష్ణా జిల్లా నాగాయలంకలోని పురాతన చరిత్ర కలిగిన శ్రీ రామ పాద క్షేత్రం ఆలయం ఓ అద్భుతానికి వేదికయింది. ఆలయం వెనక వైపు నెమ్మదిగా ప్రవహిస్తున్న కృష్ణా నదిలో పాములు ప్రత్యక్షం కావడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడి నదిని సందర్శించేందుకు వచ్చిన జనాలు.. నదీ తీరంలో ఉన్న భక్తులు.. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి మంత్రముగ్దులయ్యారు. ఈ చిత్రాలను తమ ఫోన్లలో బంధిస్తూ ఆ సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సాధారణంగా నది ప్రవాహం నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పాములు వరుసగాపైకి రావడం నీటిమీద సైలెంట్ గా కదులుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. పాములు ఎలాంటి అల్లరి లేకుండా ఎవరికి హాని చేయకుండా ఆలయం వైపు తిరిగి కొంతసేపటికి మళ్ళీ నీటిలో కలిసిపోయిన తీరు భక్తులను భక్తి భావాన్ని నింపింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.. ఇదొక అరుదైన దృశ్యమని చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.