Chiranjeevi – Sajjala Ramakrishna Reddy: చిరంజీవి కామెంట్స్పై సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్.. ఏమన్నారో తెలుసా..
రాజకీయాల నుండి ఎప్పుడో తప్పుకున్నారు.. మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలకే పరిమితమైన ఆయన.. పాలిటిక్స్వైపే చూడ్డం లేదు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సొంతంగా పోటీచేసినా కూడా ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఇటీవల జనసేనకు ఐదుకోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు.
రాజకీయాల నుండి ఎప్పుడో తప్పుకున్నారు.. మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలకే పరిమితమైన ఆయన.. పాలిటిక్స్వైపే చూడ్డం లేదు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సొంతంగా పోటీచేసినా కూడా ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఇటీవల జనసేనకు ఐదుకోట్ల విరాళం ప్రకటించిన చిరంజీవి.. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో రాజకీయ దుమారం మొదలైంది. చిరంజీవే కాదు..ఎంతమంది కలిసివచ్చినా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపును ఆపలేరని స్పష్టం చేస్తున్నారు..వైసీపీ నేతలు. గుంటనక్కలు, తోడేళ్లు ఒక్కటయ్యాయని సెటైర్ వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్ వైపే జనమున్నారని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో తాను చేసిన కామెంట్స్పై పవన్ కల్యాణ్ స్పందించడంతో సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి చిరంజీవి టార్గెట్ గా విమర్శలు సంధించారు. బ్యాంకుల్ని మోసం చేసిన వ్యక్తికి చిరంజీవి మద్దతు ఇచ్చారని మండిపడ్డారు. ఒకే స్వభావం ఉన్నవాళ్లంతా ఒకే గూటికి చేరారని.. ఎదుటివాళ్ల వ్యవహారశైలిని బట్టి రియాక్షన్స్ ఉంటాయన్నారు. దుష్ట ఆలోచనలు ఉన్నవారంతా ఒక గూటికి చేరారన్నారు..
సజ్జల వీడియో చూడండి..
వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలి..
చిరంజీవి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్. పవన్ ఒత్తిడితోనే చిరంజీవి అలా మాట్లాడి ఉండవచ్చన్నారు. ఏపీలో ఉండని చిరంజీవికి..ఇక్కడి పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు హఫీజ్ఖాన్. ఫ్యాన్స్ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పోసాని ఫైర్..
కాపులను పవన్, చిరంజీవి అవమానించారని మండిపడ్డారు.. వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి. తనను ఘోరంగా అవమానించిన వారితోనే చిరంజీవి మళ్లీ కలిశారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు సైతం చెప్పకుండా చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్కు అమ్మేశారని ఆరోపించారు పోసాని..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..